వాహనదారులపై పడనున్న పెట్రోల్‌, డీజిల్‌ ధరల భారం

న్యూఢిల్లీ,(జనంసాక్షి): వాహనదారులపై పెట్రోల్‌, డీజిల్‌ ధరల భారం పడనుంది. ఇప్పటికే పలుమార్లు పెరిగిన పెట్రోల్‌ ధర మరోసారి పెరగనుంది. నేటి అర్ధరాత్రి నుంచి పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెరిగే అవకాశం ఉంది. పెట్రోల్‌ ధర లీటర్‌ కు రూ. 4 నుంచి 5కు పెరగనున్నట్లు సమాచారం. మరోవైపు డీజిల్‌ ధర కూడా అదేస్థాయిలో పెరగనున్నట్లు తెలుస్తుంది. డీజిల్‌ లీటర్‌కు రూ. 5 పెరిగే అవకాశం ఉంది. ఇప్పటికే పెరిగిన నిత్యవసర వస్తువుల ధరలతో పేదోడి పరిస్థితి దయనీయంగా మారింది. పెట్రో ధరలు పెరిగితే నిత్యవసరాల ధరలు మరింత పెరిగే అవకాశం ఉంది.  రవాణాపై కూడా తీవ్ర ప్రభావం చూపనుంది. ఎరువుల ధరలు కూడా మరింత పెరగనున్నట్లు సమాచారం.