తల్లి హత్య కుమార్తెపై అత్యాచారం

రాయ్‌పూర్‌: సాయుధులైన కొందరు వ్యక్తులు అర్థరాత్రి ఇక ఇంటి తలుపు తట్టి దౌర్జన్యంగా లోనికి ప్రవేశించి తల్లి ఎదుటే పాతికేళ్ల ఆమె కుమార్తెపై అత్యాచారం చేసి తల్లిని హత్యచేశారు. ఛత్తీస్‌గఢ్‌లోని జష్‌పూర్‌ జిల్లాలో జరిగిందీ సంఘటన.దీనికి సంబంధించి 9 మంది నిందితుల్లో ఏడుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.