రేపు బాధ్యతలు చేపట్టనున్న రఘురాం రాజన్‌

ముంబయి : ఆర్‌బీఐ కొత్త గవర్నర్‌గా ప్రపంచ ప్రఖ్యాత ఆర్థిక వేత్త రఘురాం రాజన్‌ బుధవారం బాధ్యతలు చేపట్టనున్నారు. పడిపోతున్న రూపాయి మారకం విలువ, పెరుగుతున్న ద్రవ్యోల్బణం, కరెంటు ఖాతా లోటు, ఆశాజనకంగాలేని వృద్ధి రేటుల నేపథ్యంలో యాభై ఏళ్ల ఈ ఆర్థిక వేత్త దువ్వూరి సుబ్బారావు నుంచి భారతీయ రిజర్వు బ్యాంకు పగ్గాలు చేపట్లనున్నారు.