తెలంగాణ ప్రజలు సంయమనం పాటించాలి

జానారెడ్డి
న్యూఢిల్లీ: ఈనెల 7న జరిగే ఎపీఎన్జీవోల సభ పట్ల తెలంగాణ ప్రజలు సంయమనం పాటించాలని మంత్రి జానారెడ్డి విజ్ఞప్తి చేశారు. ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ సీడబ్ల్యూసీ తీర్మానం ప్రకారమే హైదరాబాద్‌తో కూడిన 10జిల్లాల తెలంగాణ ఏర్పాడుతుందన్నారు. రాష్ట్ర విభజనలో సమన్యాయం జరిగేలా కేంద్ర ప్రభుత్వం చూస్తుందని జానారెడ్డి అన్నారు.