గోపాల్కందాకు మధ్యంతర బెయిల్ మంజూరు
ఢిల్లీ: ఎయిర్హోస్టెన్ గీతికా శర్మ ఆత్మహత్య కేసులో నిందితుడైన హర్యానా మంత్రి గోపాల్కందాకు ఈ రోజు ఢిల్లీ న్యాయస్థానం నెల రోజుల మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. ఆయన రాష్ట్ర శాసనసభ సమావేశాలకు హాజరవడానికి గాను ఈ బెయిల్ మంజూరు చేసింది. గోపాల్ కందా గత 14 నెలలుగా జైలులో ఉన్నారు.