ఒకే వేదికపై గుజరాత్ సీఎం, గవర్నర్
అహ్మదాబాద్: గుజరాత్ గవర్నర్ కమలా బేనివాల్, ముఖ్యమంత్రి నరేంద్రమోడీలను ఒకే వేదికమీద చేర్చింది ఈ ఏడాది ఉపాధ్యాయ దినోత్సవం. ఇద్దరి మద్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి లోనూ వారిద్దరూ చాలా సంవత్సరాల తర్వాత ఒకే వేదిక మీద పక్కపక్కన కూర్చోవడం, మాట్లడుకోవడం చూసి ప్రేక్షకులు ఆశ్యర్యపోయారు. గవర్నర్ కమలా బేనివాల్ మూడు రోజుల క్రితమే గుజరాత్ ప్రభుత్వం రూపొందించిన వివాదస్పద లోకాయుక్త కమిషన్ బిల్లును తిప్పిపంపిన సంగతి తెలిసిందే. ఈ బిల్లును రాష్ట్ర శాసనసభ పూర్తి ఆధిక్యంతో ఆమోదించింది. లోకాయుక్తా నియామాకంలో గవర్నరు, రాష్ట్రహైకోర్టు ప్రధానన్యాయమూర్తి ప్రమేయం లేకుండా ముఖ్యమంత్రి అధ్యక్షతన పని చేసే కమిటీకే పూర్తి అధికారాలు కట్టబెట్టడం పై గవర్నర్ అభ్యంతరం వ్యక్తం చేశారు.