డీజీపి ఆస్థులపై సీబీఐ విచారణకు ఆదేశం
న్యూడిల్లీ : డీజీపీ దినేష్రెడ్డి ఆస్థులపై సీబీఐ విచారణకు సుప్రీంకోర్టు ఆదేశించింది. ఐపీఎస్ ఆధికారి ఉమేష్కుమార్ దాఖలు చేసిన పిటిషన్ పై అభియోగాలు ఎదుర్కోవాల్సిందేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. దర్యాప్తులోని అభ్యంతరాలపై కోర్టులోనే తేల్చుకోవాలని డీజీపీకి న్యాయస్థానం సూచించింది. ఫోర్జరీ కేసులో ఉమేష్కుమార్ కూడా అభియోగాలు ఎదుర్కోవాల్సిందేనని స్పష్టం చేసింది.