రేపటి సభ గురించి ఎవరూ ఆవేశాలకు లోను కావద్దు : జానారెడ్డి

ఢిల్లీ :రేపటి ఏపీఎన్జీవోల సభ గురించి ఎవరూ ఆవేశాలకు లోను కావద్దని విజ్ఞప్తి చేస్తున్నానని మంత్రి జానారెడ్డి అన్నారు. ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ రేపటి సభను ప్రశాంతంగా జరుపుకోవాలని కోరుతున్నామన్నారు. తెలంగాణ ఏర్పాటు చేసేందుకు అభ్యంతరం లేదని అనేక పార్టీలు లేఖలు ఇచ్చాయని అందరీ నిర్ణయాలు విన్న తర్వాతే కాంగ్రెస్‌ నిర్ణయం తీసుకుందని జానారెడ్డి అన్నారు. ఇప్పుడు అనేక పార్టీలు ద్వంద ప్రమాణాలు పాటిస్తు కాంగ్రెస్‌ పార్టీని టార్గెట్‌ చేస్తున్నాయని ఆయన అన్నారు.అన్నదమ్ములుగా విడిపోయి తెలుగుజాతిగా కలిసుందామని కోరుతున్నానని ఆయన పేర్కొన్నారు. రాష్ట్ర అభివృద్దికి ఎలాంటి అవరోధాలు ఉండకూడదని తాము కోరుతున్నామన్నారు.