ప్రధానిగా మోడీకే సీఈవోల ఓటు

ఢిల్లీ : కార్పొరేట్‌ ,వ్యాపార సంస్థల అధిపతుల్లో నాలుగింట మూడొంతుల మంది ప్రధానిగా రాహుల్‌ గాంధీకన్నా మోడీ వైపే మొగ్గుచూపుతున్నారని తాజా ఒపీనియల్‌ పోల్‌ పేర్కొంది. ప్రస్తుత ప్రభుత్వం ఆర్ధిక వ్యవస్ధను పూర్తిగా నిర్లక్యం చేసిందని మోడీనే ఈ పరిస్ధితిని మార్చగలడని వారు భావిస్తున్నారని పోల్‌ పేర్కొంటుంది.దేశ వ్యాప్తంగా 100 మంది సీఈవోలతో ఎకనమిక్‌ టైమ్స్‌ నీల్సన్‌ సంస్థలు నిర్వహించిన ఈ ఒపీనియల్‌ పోల్‌లో కేవలం 7 శాతం మాత్రమే కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని బలపరిచారు