జమ్మూకాశ్మిర్లో కాల్పులు :ముగ్గురి మృతి
షోపియాన్ : జమ్మూకాశ్మీర్ జిల్లాలోని షోపియాన్ పట్టణంలోని శనివారం పారామిలిటరి క్యాంపుపై సాయుధ మిలిటెంట్లు కాల్పులకు పాల్పడ్డారు. ఈ రోజు సాయంత్రం జుబిన్ మెహత కచేరికి వ్యతిరేకంగా వేర్పాటువాదులు బంద్కు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సీఆర్సీఎఫ్ జవాన్లకు మిలిటెంట్లకు మద్య జరిగిన కాల్పుల్లో ముగ్గురు మిలిటెంట్లు మృతి చెందారు. మిలిటెంట్ల నుంచి ఏకే -47 రైపిల్స్ను సీఆర్ఫీఎఫ్ జవాన్లు స్వాదీన పరుచుకున్నారు. ఈ కాల్పుల్లో సీఆర్ఫీఎఫ్ జవాన్లు గాయ పడ్డారని పోలీసులు తెలిపారు.