జగన్నాథ స్వామిని దర్శించుకున్న రాష్ట్రపతి
ఒడిశా:భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ శనివారం ఫూరీ జనన్నాథ స్వామిని దర్శించుకున్నారు. భువనేశ్వర్కు 55 కి.మీ దూరంలో ఉన్న ఈ దేవాలయానికి ఆయన ఉదయం ఏడుగంటలకల్లా చేరుకున్నారు. ఆలయ అధికారులు ఆయనకు స్వాగతం చెప్పారు. రాష్ట్రపతి జగన్నాధుడి దర్శనం చేసుకుని దీపాలు వెలిగించారని ఆలయ అధికారులు తెలిపారు.