ఏపిలో పరిస్థితులను చక్కబెడతాం : కేంద్రమంత్రి చిదంబరం

న్యూఢిల్లీ : ఆంద్రప్రదేశ్‌లో నెలకొన్న పరిస్ధితులను తాము అర్ధం చేసుకొగలమని కేంద్ర ఆర్ధిక మంత్రి పి.చిదంబరం అన్నారు. ఆంద్రప్రదేశ్‌లో నెలకొన్న పరిస్ధితిని చక్కదిద్దే దిశగా ప్రభుత్వం కృషి చేస్తుందని ,ఈసమయంలో ప్రత్యేక రాష్ట్ర వాదులు సంయమనంతో ఉండాలని కోరారు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ప్రజాప్రతినిధుల అభిప్రాయాలను ప్రభుత్వం వింటోందని ఆయన తెలిపారు. ప్రభుత్వం ఎప్పటికప్పుడూ సంప్రదింపులు జరుపుతుందని చిదంబరం అన్నారు.