న్యాయబిల్లులో పొరపాటుపై సిబల్‌ క్షమాపణలు

న్యూఢిల్లీ : న్యాయమంత్రి కపిల్‌సిబల్‌ శనివారం రాజ్యసభలో ఇబ్బందికర పరిస్ధితుల్ని ఎదుర్కొన్నారు. న్యాయమూర్తుల నియామకంలో కొత్త వ్యవస్థను తీసుకొచ్చేందుకు ఉద్ధేశించిన రాజ్యాంగ సవరణ బిల్లులో దొర్లిన సాంకేతికపరమైన లోపానికి క్షమాపణలు చెప్పుకోవాల్సి వచ్చింది.ఈ బిల్లును రాజ్యసభ ఆమోదించిన శుక్రవారం లోక్‌సభలో ప్రవేశపెట్టకపోవడం తనను తీవ్రంగా బాదించిందని విపక్ష సభ్యుల గందరగోళం మద్య ఆయన వ్యాఖ్యానించారు.