నేడు,రేపు బ్యాంకులు పనిచేస్తాయ్‌

ముంబయి : ఈ రోజు రేపు బ్యాంకు శాఖలు పూర్తిస్థాయిలో పనిచేసాయని రిజర్వు బ్యాంకు తెలిపింది. ఆదాయ, కార్పోరేట్‌ పన్నుల ముందస్తు పన్ను వసూళ్ల కోసం ఈ ఏర్పాటు చేసినట్లు ఆర్‌బీఐ నోటిఫికేషన్‌లో పేర్కొంది. ఇందుకోసం ఆర్థిక సేవల విభాగం, ఆర్థిక శాఖ, ప్రభుత్వాలతో చర్చించి అన్ని బ్యాంకుల కౌంటర్లను ఈ నెల 14,15 తేదీల్లో తెరిచి ఉంచేలా ఏర్పాట్లు చేసినట్లు అందులో వివరించింది. 123 చెల్లింపులను కట్టడానికి ఆర్‌బీఐ వీలు కల్పింస్తుంది.