ఎన్‌కౌంటర్‌లో వరంగల్‌ జిల్లావాసి మృతి

బడిశా : ఒడిశా రాష్ట్రంలోని మల్కజ్‌గిరి జిల్లా పోడియా పీఎస్‌ పరిధిలోని కొత్త మసీదు అటవీ ప్రాంతంలో పోలీసులకు మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో 14 మంది మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ మృతుల్లో వరంగల్‌ జిల్లా పోచంపేటకు చెందిన ప్రమీల అలియాస్‌ మీనా మృతి చెందినట్లు సమాచారం.