బీహార్‌లో పర్యటించనున్న మోడీ

న్యూఢిల్లీ : గుజరాత్‌ ముఖ్యమంత్రి నరేంద్రమోడీ ఈ రోజు బీహార్‌లోని రివారీలో నిర్వహించనున్న ర్యాలీలో పాల్గొనున్నారు. భాజపా ప్రధాని అభ్యర్థిగా శుక్రవారం ప్రకటించిన అనంతరం మోడీ మొదటిసారిగా ఈ ర్యాలీలో పాల్గొనున్నారు. దీంతో మోడీ పాల్గొనే ఈ ర్యాలీపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. బీహార్‌లోని సెక్రటేరియేట్‌ గ్రౌండ్స్‌లో ఈ ర్యాలీ జరగనుంది. మాజీ ఆర్మీ చీఫ్‌ జనరల్‌ వీకే సింగ్‌ కూడా కార్యక్రమంలో పాల్గొనున్నారు.