విజేత ద్రష్టి ధామి

ముంబయి : డ్యాన్స్‌ రియాలిటీ షో ‘ఝులక్‌ దిఖ్‌లా జా’ జీజన్‌ 6 విజేతగా టెలివిజన్‌ నటి ద్రష్టి ధామి నిలిచారు. శనివారం రాత్రి జరిగిన తుది పోటీలో ఆమె ఇతర ఫైనలిస్టులు షాన్‌, లారెన్‌, సోనాలి-సుమంత్‌లను ఓడించి ట్రోఫితో పాటు 50 లక్షల రూపాయల నగదు బహుమతిని గెలుచుకున్నారు. వైభవంగా జరిగిన ఈ కార్యక్రమానికి బాలీవుడ్‌ నటులు హృతిక్‌ రోషన్‌, ప్రియాంకా చోప్రాలు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. తమ రాబోవు చిత్రం క్రిష్‌-3లో పాటకు వీరు నృత్యం చేసి ప్రేక్షకులను అలరించారు.