హర్యానాలో మోడీ బహిరంగ సభ

హర్యానా : హర్యానా రాష్ట్రంలోని రేవారిలో జీజేపీ ప్రధాని అభ్యర్థి, గుజరాత్‌ సీఎం నరేంద్ర మోడీ పర్యటించారు. అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. పీఎం అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత ఆయన బహిరంగ సభలో పాల్గొనడం ఇదే తొలిసారి. దేశం కోసం అమరులైన జవాన్లకు మోడీ వందనాలు తెలిపారు. అగ్ని-5క్షిపణి విజయవంతంగా పరీక్షించిన శాస్త్రవేత్తలకు ఆయన అభినందనలు తెలిపారు.