అల్లర్ల కారకులపై కఠిన చర్యలు ప్రధాని

లక్నో: ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వానికి అన్ని విధాలా సాయం అందిస్తామని ప్రధాని మన్మోహన్‌సింగ్‌ తెలిపారు. ముజఫర్‌నగర్‌ జిల్లాలో అల్లర్లు జరిగిన ప్రాంతాలను కాంగ్రెస్‌ అధినేత్రి సోనియగాంధీ, రాహూల్‌గాంధీతో కలిసి ప్రధాని సందర్శించి, బాధితులను పరామర్శించారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ అల్లర్లకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.