పల్స్‌పోలియో శిబిరంలో పొరపాటుచిన్నారులకు అస్వస్థత

కోల్‌కతా, సెప్టెంబర్‌ 16 : పశ్చిమబెంగాల్‌లోని హుగ్లీ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఒక గ్రామంలోని చిన్నారులకు పల్స్‌పోలియో చుక్కల మందుకు బదులు హెపటైటిస్‌-బి వ్యాక్సిన్‌ వేయడంతో సుమారుగా వంద మందికిపైగా చిన్నారులు ఆసుపత్రుల పాలయ్యారు. హుగ్లీ జిల్లా ఖాతుల్‌ గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ పొరబాటును గుర్తించిన ఒక వ్యక్తి అధికారులకు సమాచారం ఇవ్వడంతో అధికారులు అలర్టయ్యారు. పిల్లలను ఆసుపత్రులకు తరలించారు. చుక్కల మందు వేసే కార్యక్రమాన్ని నిలిపేశారు. విషయం తెలుసుకున్న చిన్నారులతల్లిదండ్రులు కొందరుసిబ్బందిని, అధికారులను అడ్డుకున్నారు.ఈ విషయాన్ని తెలుసుకున్న ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు.