నిర్భయ హంతకుల మరణశిక్షపై హైకోర్టులో విచారణ
ఢిల్లీ : నిర్భయపై అత్యాచారం ,హత్య కేసుల్లో నలుగురు నిందితులను దోషులుగా నిర్ధారించి ఫాస్టుట్రాక్ కోర్టు విధించిన మరణశిక్షపై ఈ రోజు నుంచి ఢిల్లీ హైకోర్టులో విచారణ జరుగుతుంది. దోషులు నలుగురిని ఈ రోజు న్యాయమూర్తులు జస్టిస్ రేవాఖేత్రపాల్ ,జస్టిస్ ప్రతిభారాణిలతో కూడిన ధర్మాసనం ముందు హాజరు పరిచారు.రేపటినుంచి విచారణ రోజు కొనసాగుతుందని ,ఈ లోపల దోషులను అప్పీల్ చేసు కోవచ్చని న్యాయమూర్తులు తెలిపారు.