నేటితో ముగియనున్న వందేళ్ల సినీ వేడుకలు
చెన్నై : దక్షిణ భారత చలనచిత్ర మండలి, తమిళనాడు ప్రభుత్వం సంయుక్తంగా నిర్వహిస్తున్న భారతీయ సినిమా వందేళ్ల వేడుకలు నేటితో ముగియనున్నాయి. ఈ ముంగింపు కార్యక్రమానికి రాష్ట్రపతి ప్రణబ్ముఖర్జీ ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు.తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత , గవర్నర్ రోశయ్య, కేరళ ముఖ్యమంత్రి ఉమన్చాందీ ఈ కార్యక్రమానికి హాజరవుతున్నారు.ప్రణబ్ చేతుల మీదుగా తెలుగు. తమిళ, కన్నడ. మలయాళ. సినీ పరిశ్రమల నుంచి పలువురిని సన్మానించనున్నారు.