వందేళ్ల సినిమా వేడుకల్లో పాల్గొన్న రాష్ట్రపతి ప్రణబ్‌

చెన్నై : చెన్నైలో జరుగుతున్న భారత చలనచిత్ర శతవసంతాల వేడుకల్లో భాగంగా ఇవాళ ముగింపు ఉత్సవం కాసేపటి క్రితం ప్రారంభమైంది. భారత రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ జ్యోతి ప్రజ్వలన చేసి ముగింపు ఉత్సవాలను ప్రారంభించారు.తమిళనాడు గవర్నర్‌ రోశయ్య, ముఖ్యమంత్రి జయలలిత, కేరళ ముఖ్యమంత్రి ఉమెన్‌చాందీ,ప్రముఖ బాలీవుడ్‌ నటీ నటులు అమితాబ్‌ బచ్చన్‌ , రేఖ తదితరులు ఈ వేడుకకు హాజరయ్యారు.