నేడు బ్యాంకులు పనిచేస్తాయ్‌

న్యూఢిల్లీ : బ్యాంకులు బుధవారం యధావిధిగా పనిచేస్తాయనున్నాయి. ప్రస్తుతానికి బ్యాంకుల విలీన ప్రతిపాదన ఏది లేదని ప్రభుత్వం హామి ఇవ్వడంతో బుధవారం చేపట్టిన సమ్మెను వాయిదా వేసినట్లు అఖిల భారత బ్యాంకు ఉద్యోగుల సంఘం జనరల్‌ సెక్రటరీ సి.హెచ్‌. వెంకటాచలం తెలిపారు. ప్రధానంగా ప్రభుత్వ బ్యాంకుల విలీనానికి వ్యతిరేకంగా సమ్మె చేయాలని ఏఐబీఈఏ, భారత బ్యాంకు ఉద్యోగుల సమాఖ్య పిలుపునిచ్చిన విషయం తెలిసిందే.