నేడు భోపాల్లో పర్యటించనున్న నరేంధ్రమోడి
భోపాల్ : మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్లో భారతీయ జనతా పార్టీ ప్రధాని అభ్యర్థి, గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్రమోడి పర్యటించనున్నారు.త్వరలో ఎన్నికలు జరుగబోయే ఐదు రాష్ట్రాల్లో భాజపా నరేంద్రమోడితో ప్రచారాన్ని విస్తృతం చేసింది. మోడీ ఈరోజు మధ్యాహ్నం 12గంటలకు ప్రత్యేక విమానంలో భోపాల్ చేరుకోనున్నారు. సభకు పార్టీ శ్రేణులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.ఈ సభలో భాజపా జనతా పార్టీ సీనియర్ నేత అడ్వాణి కూడా పాల్గొననున్నట్లు సమాచారం.