యూఎస్‌ డిస్ట్రిక్‌ కోర్టు జడ్జిగా భారత సంతతి మహిళ

వాషింగ్టన్‌ : అమెరికా లో భారత సంతతి మహిళను కీలక పదవి వరించింది. యూఎస్‌ డిస్ట్రిక్‌ కోర్టు జడ్జిగా ఇందిరా తల్వానీని నియమించారు. అమెరికా అధ్యక్షుడు బరాక్‌ ఒబామా ఆమెను నామినేట్‌ చేశారు. భారత సంతతి వ్యక్తి మనీష్‌ షాను యూఎస్‌ డిస్ట్రిక్‌ కోర్టు జడ్జిగా ఇటీవల నియమించిన సంగతి తెలిసిందే. కాగా ఈ పదవికి ఎంపికైన తొలి దక్షిణాసియా మహిళ ఇందిరా కావడం విశేషం.