బాణాసంచా తయారీ కేంద్రంలో పేలుడు :నలుగురి మృతి

చెన్నై : మదురై జిల్లాలో ఆనందం ఫైర్‌ వర్స్క్‌ టపాసుల తయారీ కేంద్రంలో మంగళవారం సాయంత్రం పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో నలుగురు చనిపోగా 18మంది గాయపడ్డారు.మృతి చెందినవారిలో ముగ్గురు మహిళలు ఉన్నారు. మధురై జిల్లా కేంద్రానికి సమీపంలోని చిక్కనూరాని ప్రాంతంలో ఈ పేలుడు సంభవించింది.టపాసుల తయారీకి రసాయనాలు కలుపుతుండగా పేలుడు సంభవించి ఉండవచ్చని అధికారులు తెలిపారు.