ఏడో వేతన సంఘాన్ని ప్రకటించిన కేంద్రం

న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కోసం కేంద్ర ప్రభుత్వం ఇవాళ ఏడో వేతన సంఘాన్ని ప్రకటించింది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతభత్యాలపై కమీషన్‌ సిఫార్సు చేయనుంది. 50 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు., 35లక్షల మంది ఫించన్‌దారులు లబ్ది పొందనున్నారు.2016 జనవరి 1నుంచి ఏడో వేతన సంఘం అమల్లోకి రానుంది.