అద్వానీ తమకు మార్గదర్శకుడు : నరేంద్రమోడీ
బోపాల్: బీజేపీ అగ్రనేత ఎల్కే అద్వానీ తమకు మార్గదర్శకుడని గుజరాత్ సీఎం నరేంద్రమోడీ వ్యాఖ్యానించారు. భోపాల్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మోడీ ప్రసంగించారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి వస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తంచేశారు. సీఎం శివరాజ్సింగ్ చౌహాన్ నాయకత్వంలో మధ్యప్రదేశ్ రాష్ట్రం అన్ని రంగాల్లో చాలా అభివృద్ది చెందిందని ఆయన పేర్కొన్నారు.పేదరిక నిర్మూలన కోసం శివరాజ్సింగ్ చౌహాన్ నిర్విరామంగా కృషి చేశారని మోడీ తెలిపారు.