ఫిలిప్పీన్స్‌లో భారతీయుడి కాల్చివేత

సింగపూర్‌ : ఫిలిప్పీన్స్‌లో గుర్తు తెలియని దుండగులు జరిపిన కాల్పుల్లో ఓ భారతీయుడు మరణించగా, మరొకరు సుక్షితంగా బయటపడ్డారు. జస్వీందర్‌ సింగ్‌ అనే వ్యక్తి బటాక్‌ నగరంలో నివసిస్తున్నాడు. మంగళవారం ఆయన తన సమీప బంధువు అమరీందర్‌సింగ్‌ తో కలిసి బటాక్‌ నుంచి ఇలోకస్‌సర్‌ రాష్ట్రానికి కారలో బయలుదేరాడు.జాతీయ రహదారిపై ప్రయాణిస్తుండగా మోటర్‌ సైకిల్‌పై వచ్చిన ఓ ఆగంతుకుడు వారిపై కాల్పులు జరిపాడు.