ఎస్బీఐ ఛైర్మన్గా అరుంధతీ భట్టాచార్య ?
ఢిల్లీ : స్టేట్బ్యాంక్ ఆఫ్ ఇండియా ఛైర్మన్గా తొలిసారిగా ఒక మహిళ నియామకానికి మార్గం సుగమమైంది. ప్రస్తుతం ఎస్బీఐ ఎండీ సీఎఫ్వోగా ఉన్న అరుంధతీ భట్టాచార్యను ఛైర్మన్గా నియమించడానికి కేంద్ర ఆర్ధిక మంత్రి చిదంబరం ఆమోదం తెలిపినట్టు సమాచారం. ప్రధాని ఆద్వర్యంలోని కేబినేట్ అప్పాయింట్ కమిటి కూడా ఆమోదిస్తె అరుంధతి నియామకం అధికారికంగా పూర్తవుతుంది.