సైన్యం దుస్తుల్లో వచ్చి పోలీస్స్టేషన్పై కాల్పులకు పాల్పడ్డ దుండగులు
శ్రీనగర్ : జమ్మూకాశ్మీర్లోని కథువా జిల్లాలో పోలీస్స్టేషన్పై ఉగ్రవాదులు ఈ ఉదయం కాల్పులు జరిపారు. సైన్యం దుస్తుల్లో వచ్చిన ఉగ్రవాదులు జిల్లాలోని హీరానగర్ పోలీస్ స్టేషన్పై ఒక్కసారిగా విరుచకుపడి కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఐదుగురు పోలీసులతో సహా ఏడుగురు మరణించారు. పలువురు పోలీసులు తీవ్రంగా గాయపడ్డారు.ఐదుగురు ఉగ్రవాదులు దాడులకు పాల్పడ్డారు. దాడి అనంతరం ఉగ్రవాదులు స్టేషన్ బయట ఉన్న ట్రక్కులో వెళ్లిపోయారు. అక్కడి నుంచి సాంబ జిల్లాలోని సైనిక స్థావరాల వద్ద కాల్పులకు పాల్పడ్డారు. సైనిక స్థావరం వద్ద కాల్పులు కొనసాగుతున్నాయి.