ప్రధాని మన్మోహన్‌కు అమెరికా కోర్టు సమన్లు

వాషింగ్టన్‌ : అమెరికా పర్యటనకు భారత నాయకులు ఎవరైనా వెళ్లినా అక్కడి కోర్టుల నుంచి సమన్లు తప్పడం లేదు.తాజాగా ,నాలుగు రోజుల పర్యటన నిమిత్తం అమెరికా వెళ్లిన భారత ప్రధాని మన్మోహన్‌సింగ్‌కు అక్కడి కోర్టు సమన్లు ఇచ్చింది.1990లలో పంజాబ్‌ రాష్ట్రంలో ఉగ్రవాద నిరోధ ఆపరేషన్ల సందర్భంగా మానవహక్కుల ఉల్లంఘన జరిగిందంటూ ..దానికి సంబంధించి ఈ సమన్లు అందించింది.