జమ్మూలో తీవ్రవాదుల దాడులను ఖండించిన బీజేపి
న్యూఢిల్లీ :జమ్మూ కాశ్మీర్లో ఈరోజు ఉదయం పాక్ ప్రేరేపిత తీవ్రవాదుల జంట దాడులను భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండించింది. ఆ పార్టీ అధికార ప్రతినిధి ప్రకాశ్ జావదేకర్ గురువారం న్యూఢిల్లీలో విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ భారత్లో తీవ్రవాద దాడుల ద్వారా పాక్ ప్రచ్చన్న యుద్దానికి పాల్పడుతొందని ఆయన ఆరోపించారు.