జమ్మూలో దాడిగురించి సమాచారం సేకరిస్తున్నాం : హోంమంత్రి షిండే

న్యూఢిల్లీ : జమ్మూకాశ్మిర్‌ రాష్ట్రంలో గురువారం ఉదయం జరిగిన ఉగ్రవాద దాడి గురించి పూర్తి సమాచారం సేకరిస్తున్నట్లు కేంద్ర హోంమంత్రి సుశీల్‌కుమార్‌ షిండే తెలిపారు. పోలీస్‌ స్టేషన్‌తో పాటు ఆర్మీ క్యాంపుపై కూడా ఉగ్రవాదులు దాడి చేసినట్లు తెలుస్తొందని ,ఈ దాడిలో ఒక లెప్టినెంట్‌ కల్నల్‌ కూడా మరణించారని షిండే తెలిపారు.