కాంగ్రెస్‌ నిర్ణయం మార్చుకోదు : దిగ్విజయ్‌ సింగ్‌

న్యూఢిల్లీ : రాష్ట్ర విభజనపై అందరితో చర్చించిన తర్వాతే నిర్ణయం తీసుకున్నామని కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర వ్యవహరాల ఇంచార్జీ దిగ్జిజయ్‌సింగ్‌ అన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ..అధిష్టానం తీసుకున్న నిర్ణయానికి కాంగ్రెస్‌ నేతలంతా కట్టుబడి ఉంటామని చెప్పారని దిగ్జిజయ్‌ గుర్తు చేశారు. మూడు ప్రాంతాల ప్రజల ఏకాభిప్రాయం తీసుకున్న తర్వాతే నిర్ణయం తీసుకున్నామని ఆయన చెప్పారు. రాష్ట్ర విభజన ఇంకా జరగలేదు,కిరణ్‌ కుమార్‌రెడ్డి అన్ని ప్రాంతాలకు సీఎం వ్యవహరించాలని చెప్పారు.సీఎం వ్యాఖ్యలను పరిశీలించిన తర్వాతే స్పందిస్తానని దిగ్విజయ్‌ అన్నారు.