భారత్‌-పాక్‌ సరిహద్దులో మళ్లి కాల్పులకు పాల్పడిన పాక్‌

జమ్ము : ఐక్యరాజ్యసమితి సర్వప్రతినిధి సభ సాక్షిగా భారత్‌- పాకిస్థాన్‌ దేశాల ప్రధాన మంత్రులు సమావేశం కావడానికి ఒక్క రోజు ముందు కూడా పాకిస్థాన్‌ దళాలు తెగబడ్డాయి. నియంత్రణ రేఖ వెంబడి రెండు ప్రాంతాల్లో కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి కాల్పులు జరిపాయి. జమ్ము కాశ్మిర్‌ రాష్ట్రంలోని రాజౌరి జిల్లాలో బీమార్‌ గలీ సెక్టార్‌ వద్ద నియంత్రణ రేఖ వెంబడి పాక్‌ దళాలు ఎలాంటి కవ్వింపు లేకుండానే కాల్పులకు పాల్పడినట్లు డిపెన్స్‌ ప్రతినిధి కెప్టెన్‌ ఎస్‌.ఎన్‌.ఆచార్య తెలిపారు.