ఢిల్లీలో వ్యాపారవేత్తపై కాల్పులకు పాల్పడిన దుండగులు
న్యూఢిల్లీ : ఢిల్లీలో నిత్యం రద్దిగా ఉండే ఓ మార్కెట్లో గుర్తు తెలియని వ్యక్తులు ఓ వ్యాపారవేత్తపై కాల్పులు జరిపారు. సోమవారం మోటర్ సైకిల్పై వచ్చిన దుండగులు జితేందర్ సింగ్ (39) పై దాడి చేసినట్లు చెప్పారు. ఆయనపై నాలుగైదు రౌండ్లు కాల్పులు జరిపి వెంటనే అక్కడి నుంచి పారిపోయినట్లు తెలిపారు. ఢిల్లీలోని తిలక్నగర్ ప్రాంతంలో ఆయన ఆఫీస్ బయట ఈ సంఘటన జరిగింది.