పోరాడితే విజయం తప్పక దక్కుతుంది : యువరాజ్‌

కోల్‌కతా : కేన్సర్‌ వ్యాధికి నివారణ లేదన్నది అపోహ మాత్రమేనని , ఆత్మవిశ్వాసంతో ఎదుర్కోంటే పూర్తిగా నయమవుతుందని బాలీవుడ్‌ నటీ మనీషకోయిరాల ,టీమీండియా క్రికెటర్‌ యువరాజ్‌ సింగ్‌ అన్నారు. కేన్సర్‌ గురించి ప్రజల్లో పూర్తిగా చైతన్యం కలిగించేందుకు కోల్‌కతాలో జరిగిన ఓ కార్యక్రమంలో వీరిద్దరూ పాల్గొన్నారు. ఈ ప్రాణాంతక వ్యాధి బారినపడ్డ మనీషా, యువరాజ్‌ ఇద్దరూ పూర్తిగా కోలుకుని మళ్లీ కేరిర్‌ కొనసాగిస్తున్న విషయం తెలిసిందే. యువీ జాతీయ జట్టులోకి రాగా, మనీషా సినిమాల్లో నటించేందుకు సిద్దమవుతుంది.