దేశంలో ఇండియన్‌ ముజాహిదీన్‌ మరిన్ని దాడులు

న్యూఢిల్లీ : దేశంలో శాంతి భద్రతలను ప్రశ్నించే విధంగా తీవ్రవాద సంస్థ ఇండియన్‌ ముజాహిదీన్‌ దాడులకు పాల్పడే అవకాశం ఉందని కేంద్ర హోం శాఖ 28 రాష్ట్రాలు ,కేంద్ర పాలిత ప్రాంతాలను శుక్రవారం హెచ్చరించింది. ఈ నేపథ్యంలో ట్టుదిట్టమైన భద్రత చర్యలు చేపట్టాలని రాష్ట్రాలకు కేంద్రపాలిత ప్రాంతాలకు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీ చేసింది. హిందువులు అత్యంత భక్తి శ్రద్దలతో జరుపుకునే దసరా, దీపావళీ పండుగల లక్ష్యంగా దాడులు చేయవచ్చని ఆ తీవ్రవాద సంస్థ ప్రణాళికలు సిద్దం చేస్తున్నట్లు నిఘా వర్గాలు తమకు సమాచారం అందించాయని తెలిపింది.