కాశ్మీర్‌లో ఇద్దరు తీవ్రవాదుల హతం

శ్రీనగర్‌ : కాశ్మీర్‌లోని కుప్వారా జిల్లా సమీపంలో భారత్‌లోకి అక్రమంగా చోరబడుతున్న ఇద్దరు తీవ్రవాదులకు భారత్‌ ఆర్మీ దళాలు కాల్చి చంపినట్లు రక్షణ శాఖ ప్రతినిధి శుక్రవారం ఇక్కడ వెల్లడించారు.కెరన్‌ సెక్టర్‌ సమీపంలోని నియంత్రణ రేఖ వద్ద ఇద్దరు తీవ్రవాదులు అక్రమంగా భారత్‌లో ప్రవేశించినందుకు ప్రయత్నిస్తున్న సమయంలో భారత్‌ ఆర్మీ దళాలు కాల్పుల జరిపాయని వివరించారు.