తెలంగాణపై నిర్ణయం తేలికైనది కాదు : అప్జల్
న్యూఢిల్లీ : తెలంగాణపై నిర్ణయం తేలికైనది కాదని.. విస్తృత ఏకాభిప్రాయం తర్వాతే నిర్ణయం తీసుకున్నామని ఏఐసీసీ అధికార ప్రతినిధి మిలీమ్ అప్జల్ పేర్కొన్నారు. 60 ఏళ్లుగా తెలంగాణ డిమాండ్ ఉందని గుర్తు చేశారు. కాంగ్రెస్ నిర్ణయాన్ని అమలు చేసేలా ముందుకు వెళ్తామని చెప్పారు. తెలంగాణపై నిర్ణయంలో రాహుల్గాంధీ పాత్ర కూడా ఉందన్నారు.కేంద్రమంత్రులు, ఎంపీల రాజీనామలు పార్టీ అంతర్గతం .. రాజీనామాలపై చర్చలు జరుపుతున్నాయని ఆప్జల్ తెలిపారు.