బీసీసీఐ శ్రీనివాసన్‌ కేసు 7కు వాయిదా

న్యూఢిల్లీ : బీసీసీఐ అధ్యక్షుడిగా ఎన్నికైన శ్రీనివాస్‌కు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్‌పై విచారణను సుప్రీంకోర్టు వాయిదా వేసింది.వచ్చే నెల 7వ తేదికి వాయిదా వేస్తున్నట్లు కోర్టు వెల్లడించింది. శ్రీనివాసన్‌ బీసీసీఐ అధ్యక్షుడిగా కొనసాగుతారని ,అయితే ఐపీఎల్‌ వ్యవహరాల్లో జోక్యం చేసుకోరాదని ఆదేశించింది.పలు అంశాలపై బీసీసీఐ తీరును కోర్టు తప్పు పట్టింది.