ప్రధాని శ్రీలంక పర్యటనపై అస్పష్టత

న్యూఢిల్లీ : వచ్చే నెల శ్రీలంకలో జరుగనున్న కామన్‌వెల్త్‌ దేశాధినేతల సమావేశంలో ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్‌ పాల్గొంటారా ? లేదా ? అన్న దానిపై కేంద్రప్రభుత్వం ఇప్పటికీ ఒక నిర్ణయానికి రాలేదు. ఎల్టీటిఈ ఓటమి తర్వాత శ్రీలంకలో తమిళులపై జరిగిన దారుణ ఊచకోత ను నిరసిస్తూ తమిళనాడులోని అన్ని రాజకీయ పార్టీలు ప్రధాని శ్రీలంక పర్యటనను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి.