నరేంద్ర మోడీ పాలనలో పేదరికం తాండవిస్తోంది : దిగ్విజయ్
న్యూఢిల్లీ : గుజరాత్ ముఖ్యమంత్రి,బీజేపీ ప్రధాని అభ్యర్ధి నరేంద్ర మోడీపై కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ మరోసారి మండిపడ్డారు. మోడీ ముఖ్యమంత్రి అయిన తరువాత గుజరాత్లో పేదరికం తాండవిస్తోందని తీవ్ర విమర్శలు చేశారు. గుజరాత్ను అభివృద్ది పధంలో నడిపించామని గొప్పలు చెప్పుకుంటున్న మోడీ.. అక్కడ నానాటికీ పెరిగిపోతున్న పేదరికాన్ని మరిచిపోయినట్లున్నారని ఎద్దేవా చేశారు. మోడీ ముఖ్యమంత్రి అయిన అనంతరం గుజరాత్లో దారిద్య్రానికి దిగువన ఉన్న కుటుంబాల సంఖ్య పెరిగిందని దిగ్విజయ్ సింగ్ అన్నారు.