షిల్లాంగ్‌లో రాష్ట్రపతి పర్యటన : భద్ర కట్టుదిట్టం

షిల్లాంగ్‌ : రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ రేపటి నుంచి రెండు రోజుల పాటు షిల్లాంగ్‌లో పర్యటించనున్న నేపధ్యంలో భద్రతను కట్టుదిట్టం చేశారు. షిల్లాంగ్‌లో మిలిటెంట్లు 36 గంటలపాటు బంద్‌కు పిలుపున్విడంతో వేల సంఖ్యలో పోలీసులు , పారామిలటరీ బృందం ఎగువ షిల్లాంగ్‌ ఎయిర్‌ ఫోర్స్‌ నుంచి రాష్ట్రపతి వెళ్లే మార్గాలను క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. మావ్లాయిలోని నార్త్‌ ఈస్టర్న్‌ హిల్స్‌ విశ్వవిద్యాలయంలో జరగనున్న స్నాతకోత్సవంలో రాష్ట్రపతి పాల్గొని ప్రసంగించారు.