గుండెపోటుతో మృతిచెందిన పాకిస్థాని నేపథ్యగాయని బుబైదా

లాహోర్‌ : ప్రముఖ పాకిస్ధాన్‌ నేపథ్యగాయని జుబైదా ఖానమ్‌ (78) ఇకలేరు. తీవ్రమైన గుండెపోటుతో ఆమె శనివారం కన్నుమూశారు. ఆమె 1935లో అమృత్‌సర్‌లో జన్మించారు. దేశ విభజన సమయంలో జుబైదా చిన్న వయసులోనే ఆమె కుటుంబం పాకిస్థాన్‌ వలసపోయింది. దీంతో ఆమె అక్కడే స్థిరపడి పోయి ప్రముఖ కేమెరామెన్‌ రియాజ్‌ భోకరిని వివాహం చేసుకున్నారు. వీరి కుమారుడు పైనల్‌ భోకరి.ఆయన ప్రస్తుతం కెమెరామెన్‌గా పనిచేస్తున్నాడు. జుబైదా పలు చిత్రాల్లో నటించారు. ఆమె మృతిపట్ల పాకిస్థాన్‌ ప్రధాని నవాజ్‌ షరీఫ్‌ తీవ్ర సంతాపాన్ని ప్రకటించారు.