కాశ్మీర్‌పై మరో దేశం జోక్యం అనవసరం : కేంద్రమంత్రి షిండే

న్యూఢిల్లీ :కాశ్మీర్‌ విషయంలో మరో దేశం జోక్యం చేసుకోవడాన్ని తాము స్వాగతించమని కేంద్ర హోంమంత్రి సుశీల్‌కుమార్‌ షిండే స్పష్టం చేశారు. కాశ్మీర్‌ సమస్యను పరిష్కరించాలని పాక్‌ ప్రధాని అమెరికాను కోరిన నేపథ్యంలో షిండే సోమవారం విలేకరులతో మాట్లాడారు. కాశ్మీర్‌ ఇరు దేశాలకు సంబంధించిన సమస్య ఇందులో మూడో దేశం అవసరం లేదు అని అన్నారు. నెహ్రూ హయాం నుంచి ఇదే పద్దతి అనుసరిస్తున్నారని పునరుద్ఘాటించారు.