వేలానికి గాంధీ చరఖా

న్యూఢిల్లీ : స్వాతంత్య్రోద్యమ నేపథ్యంలో ఎరవాడ జైల్లో ఉన్నప్పుడు మహాత్మాగాంధీ ఉపయోగించిన చరఖా(రాట్నం) ను ఇంగ్లాండ్‌లో నవంబర్‌ 5న వేలం వేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. గాంధీ ఈ చరఖాను అమెరికాకు చెందిన పుఫర్‌కు బహుమతిగా ఇచ్చారు. రాట్నం వడకడం గాంధీజీ దినచర్యలో ఓ తప్పనిసరి అంశంగా ఉండేది.