నేడు వెలువడనున్న విప్రో ఫలితాలు

బెంగళూర్‌ :ఐటీ వ్యాపారం మినహా ఇతర వ్యాపార విభాగాలను విభజిచడమే కాక ఐటీ ఉద్యోగుల వేతనాలు 6-8శాతం పెంచినప్పటికి రెండో త్రైమాసికానికి విప్రో మెరుగైన ఫలితాలను ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. రూపాయి క్షీణత ఇందుకు ప్రధాన కారణం. సెప్టెంబర్‌తో ముగిసిన మూడు నెలలకు విప్రో ఏకికృత నికర లాభం రూ.1,842 కోట్లకు చేరుకునే అవకాశం ఉంది. ఇది అంతక్రితం త్రైమాసికం కన్నా 13 శాతం ఎక్కువ.